రాముడిగా చేస్తున్నా కదా అని ప్రభాస్ కేవలం సినిమాకే పరిమితం అయిపోలేదు. తన వంతు బాధ్యతగా రాముడికి భారీ విరాళం ఇచ్చాడు. ఇంతకీ ఏంటి సంగతి?
డార్లింగ్ ప్రభాస్ కి మొహమాటం ఎక్కువ కానీ మనసు మాత్రం వెన్న. అతడితో కలిసి పనిచేసిన ఏ యాక్టర్ ని అడిగినా సరే ఈ విషయం చెబుతారు. మరీ ముఖ్యంగా ఆతిథ్యం విషయంలో టాలీవుడ్ లో ఏ హీరో కూడా ప్రభాస్ ని దాటలేడు. ఫుడ్ విషయంలో డార్లింగ్ ని కొట్టడం ఎవరివల్ల కాదు. ఓన్లీ ఇదే కాదు చాలా విషయాల్లోనూ ప్రభాస్ మంచి మనసు చాటుకుంటూ ఉంటాడు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ప్రస్తుతం ఇది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చర్చకు కారణమైంది.
అసలు విషయానికొచ్చేస్తే.. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అందులో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇందులో డార్లింగ్ హీరో రాముడిగా నటిస్తున్నాడు. రెండుమూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ రకరకాల రీజన్స్ వల్ల ఇప్పటికి సిద్ధమైంది. జూన్ 16న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ తో అంచనాల్ని పెంచేశారు. దీంతో మూవీ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి టైంలో ప్రభాస్ మంచి మనసు చాటుకున్నారు. భద్రాద్రి ఆలయానికి తన వంతు సాయంగా రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. అంటే రాముడికి ఇచ్చినట్లే. ‘ఆదిపురుష్’లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్.. సినిమాలోనే కాదు బయట కూడా ఆ దేవదేవుడికి తన వంతు బాధ్యతగానే ఈ మొత్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణ రాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి ద్వారా ఆలయ ఈవో రమాదేవికి ఆ చెక్ ని అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల నిమిత్తం కేటాయించినట్లు ఏఈవో భవాని రామకృష్ణారావు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ‘ఆదిపురుష్’ విజయవంతం కావాలని ఆలయంలో ప్రత్యేక పూజాలు చేశారు. మరి భద్రాద్రి రాముడికి ప్రభాస్ విరాళం ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.