‘కొందరితో నేను బెడ్ షేర్ చేసుకుని ఉంటే, ఇది నా 30వ సినిమా అయ్యేది. పెద్ద సినిమాలు రావాలంటే బెడ్రూమ్లోకి వెళ్లాల్సిందే’.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
చిత్ర పరిశ్రమలోని మహిళలు ఒప్పటి కంటే ధైర్యంగా గతంలో తమకు జరిగిన అన్యాయం గురించి గొంతు విప్పుతున్నారు. లొంగకపోవడం వల్లనే తమకు అవకాశాలు రావడం లేందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’ ఉద్యమంతో మీడియా ముందుకొచ్చి ఎంతలా ప్రకంపనలు సృష్టించారో తెలిసిందే. హాలీవుడ్ మొదలుకుని అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ తరహా వార్తలు, వాదనలు వినిపించాయి. తాజాగా మంచు లక్ష్మీ కూడా తెలుగు పరిశ్రమ గురించి, తెలుగు హీరోయిన్లకి ఆఫర్స్ రాకపోవడం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు పాపులర్ యాక్ట్రెస్ పాయల్ ఘోష్, అవకాశాలు రావాలంటే దర్శకుల పడక గదికి వెళ్లాలంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగులో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’, ‘మిస్టర్ రాస్కెల్’ లాంటి సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ఆ మధ్య బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త సినిమా గురించి చెప్తూ తన స్టైల్లో కామెంట్స్ చేసింది. ఇటీవల ‘ఫైర్ ఆఫ్ లవ్ రెడ్’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది తన 11వ మూవీ. దీనికి సంబంధించి రీసెంట్గా ఓ పోస్ట్ చేసింది పాయల్.
‘కొందరితో నేను బెడ్ షేర్ చేసుకుని ఉంటే, ఇది నా 30వ సినిమా అయ్యేది. పెద్ద సినిమాలు రావాలంటే బెడ్రూమ్లోకి వెళ్లాల్సిందే.. లేదంటే సినిమా ఛాన్సులు రావడం కష్టమే..’ అని చెప్పుకొచ్చింది. దీని గురించి నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఏమైంది?.. నువ్వు పడ్డ ఇబ్బందులేంటో మాతో షేర్ చేసుకోవచ్చుగా’.. ‘ఎంత కష్టమైనా సరే కానీ నువ్వు నిజాయితీగా ఉండు, అడ్డదారులు తొక్కొద్దు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కాసేపటి తర్వాత ఈ పోస్ట్ డిలీట్ చేసింది పాయల్ ఘోష్.