సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలకు బ్రేక్ పడటం లేదు. కొన్ని గంటల వ్యవధిలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇద్దరు లెజండ్స్ ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఇలాంటి సందర్భంలోనే ఇండస్ట్రీలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో మున్నాభాయ్ అతని గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే… ఆ గ్యాంగ్ లో మున్నా క్లోజ్ ఫ్రెండ్ లలిత్ పాత్రలో నటించి, మంచి పేరు దక్కించుకున్న నటుడు బ్రహ్మ మిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
బ్రహ్మ మిశ్రా విషయాన్ని నటుడు దివ్యేందు శర్మ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. బ్రహ్మ మిశ్రా డెడ్ బాడీని కూపర్ హాస్పిటల్ కి తరలించినట్టు తెలుస్తోంది. అయితే.. బ్రహ్మ మిశ్రా ఎలా చనిపోయాడన్న విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే బ్రహ్మ మిశ్రా మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. మరి..అకాల మరణం చెందిన బ్రహ్మ మిశ్రా ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.