తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో జాతీయ స్థాయిలో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ వచ్చింది. నాలుగేండ్ల పాటు ప్రేక్షకులకు వెయిట్ చేయించిన ఈ మల్టీస్టారర్ చిత్రం రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇంకా ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ మ్యానియా ఏ మాత్రం తగ్గలేదు.
రామ్ చరణ్ పంజాబ్ లో జరుగుతున్న ఒక షూటింగ్ బిజీలో ఉన్నాడు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ క్రేజీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు. ఇక్కడ షూటింగ్ లో గ్యాప్ రావడంతో అమృత్ సర్ కు సమీపంలోని ఖాసా సరిహద్దుల వద్దకు వెళ్లారు రామ్ చరణ్. అక్కడ బీఎస్ ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా షెఫ్ ని పిలిపించి ఇక్కడ వంటకాలను వడ్డించి జవాన్లకు ఇంటి వంట రుచి చూపించాడు.
ప్రతినిత్యం బార్డర్ లో కోట్ల మంది ప్రజల కోసం పహారా కాస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువలతో పోటాం చేస్తున్న మన జవాన్లకు రామ్ చరణ్ ఇచ్చిన ట్రీట్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బీఎస్ఎఫ్ సైనికులతో కలసి కాసేపు గడిపారు. ఎంతో ఉత్సాహంగా ఫొటోలు దిగి జవాన్లను ఉత్సాహపరిచారు. బీఎస్ఎఫ్ సైనికులతో కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.