టాలీవుడ్ లో టాప్ మోస్ట్ స్టంట్స్ కొరియోగ్రఫర్లు గా పేరు తెచ్చుకున్నారు రామ్ - లక్ష్మణ్. చిన్న ఫైటర్లుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ - లక్ష్మణ్ అనతి కాలంలోనే ఫైట్ మాస్టర్స్ గా ఎదిగారు. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే ఈ సంట్ మాస్టర్స్.. ఏ చిన్న విరామం దొరికినా తమ స్వగ్రామం చీరాలకు వెళ్లి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఫైట్ మాస్టర్స్ గా పనిచేసిన రామ్ – లక్ష్మణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇండస్ట్రీలో మనం ఎంతగానో అభిమానించే హీరోలకు ఎంతో పవర్ ఫుల్ గా చూపించడానికి రక రకాల స్టంట్స్ తో ఇద్దరు అన్నదమ్ములు ఎంతో కష్టపడుతుంటారు. రామ్ – లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గానే కాకుండా కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. సౌత్ లో టాప్ స్టంట్ మాస్టర్స్ గా వీరిద్దరికీ ఎంతో గొప్ప పేరు ఉంది. అలాంటిది రామ్-లక్ష్మణ్ చీరాలలో జోళి పట్టి బిక్షాటన చేశారు. ఈ టాప్ ఫైట్ మాస్టర్స్ ఎందుకు అలా చేశారు.. అసలు ఏంటీ కారణం అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు ఫైట్ మాస్టర్స్ గా పనిచేసిన రామ్ – లక్ష్మణ్ హీరోలను పవర్ ఫుల్ గా చూపించడంలో వారికి వారే సాటి అంటారు. సౌత్ లో స్టార్ హీరోలకు స్టంట్స్ కొరియోగ్రఫి చేసిన ఈ ఇద్దరు అన్నదమ్ములు తాజాగా గొప్ప మనసు చాటుకున్నారు. చీరాలలో రోడ్డుపై జోళి పట్టుకొని బిక్షాటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్టంట్స్ మాస్టర్స్ గా చెలామణి అవుతున్న వీరిద్దరికీ జోళి పట్టుకొని బిక్షాటన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే..దాని వెనుక ఓ బలమైన కారణం ఉంది. రామ్-లక్ష్మణ్ కి ఇండస్ట్రీలో కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు వెంటనే వారి స్వగ్రామమైన చీరాలకు చేరుకుంటారు. తాజాగా చీరాలలో ఉండే ‘కోటయ్య వృద్దాశ్రమం’ కోసం వీరు గొప్ప మనసు చాటుకున్నారు.
కోటయ్య వృద్దాశ్రమంలో ఎంతోమంది వృద్దులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆశ్రయానికి ఒక ఆటో అవసరం ఉంది.. ఈ విషయం గురించి తెలిసిన రామ్-లక్ష్మణ్ చీరాలలోని ప్రధాన రహదారుల్లో జోళి పట్టుకొని బిక్షాటన చేసి ప్రజల నుంచి నగదు సేకరించి ఆ వచ్చిన డబ్బుకి తమ వంతు సహాయం చేసి ఆశ్రమానికి అందించారు. అయితే ఇండస్ట్రీలో టామ్ మోస్ట్ ఫైట్ మాస్టర్స్ కదా.. మీ వద్ద ఉన్న డబ్బుతో ఆటో కొనిపించి ఇవ్వొచ్చు కదా అన్న ప్రశ్నికు.. ‘తమ వద్ద డబ్బుతో కొనిపించడం పెద్ద విషయం కాదు.. కానీ ఆ ఆశ్రమానికి ఆటో అవసరం అన్న విషయం ప్రజలకు తెలియాలి.. ప్రజలను కూడా ఓ మంచి పనిలో భాగస్వామ్యం అయ్యేలా చేయడమే తమ ఉద్దేశ్యం.. అందుకే తాము బిక్షాటన చేశాం. మానవసేవే మాధవ సేవ అనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలి.. అప్పుడు అందరూ బాగుంటారు’ అని అన్నారు. ఎంతోమంది వృద్దులకు ఆశ్రయం కల్పిస్తూ.. వారి బాగోగులు చూసుకుంటున్న స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఇద్దరు అన్నదమ్ములు కలిసి అభినందించారు. ఇక రామ్-లక్ష్మణ్ చేసిన గొప్ప పని చూసి ఫ్యాన్స్ తో పాటు పలువురు సోషల్ మీడియాతో ప్రశంసిస్తున్నారు.