RRR మూవీతో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘గేమ్ ఛేంజర్’. అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి.
RRR మూవీతో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్, ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘గేమ్ ఛేంజర్’. అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్గా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. అయితే ‘హిట్ 2’ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రంలో రామ్ చరణ్ లేని కొన్ని సీన్లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా అనేక కారణాల వలన సినిమా డిలే అవుతూ వస్తుంది.
RRR ప్రమోషన్స్, ఆస్కార్ ఈవెంట్ కారణంగా కొన్ని రోజులు షూటింగ్కు హాజరవలేదు చరణ్. ఇటీవలే చరణ్కు కూతురు పుట్టడంతో మరో సారి షూటింగ్కు బ్రేకులు పడట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే శంకర్ పరిస్ధితి మరోలా ఉంది. ఎప్పుడో మొదలు పెట్టిన ‘ఇండియన్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ ప్యాచ్ వర్క్ షూటింగ్ను శైలేష్ కొలనుకి అప్పజెప్పారట. కాగా, ఈ సినిమా డైరెక్టర్ శంకర్ లేకుండా మరో దర్శకుడితో షూటింగ్ ఏంటంటూ సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అసలు విషయం తెలిసిన తర్వాత కూల్ అయ్యారు.
ఇక ‘ఇండియన్ 2’ తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి చరణ్ సినిమాతో మళ్లీ బిజీ కానున్నాడు శంకర్. అప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ షూట్ శైలేష్ కంప్లీట్ చేశారట. రెగ్యులర్ షూటింగ్ (మంగళవారం) జూలై 11 నుండి ప్రారంభమైంది. శంకర్ మళ్ళీ రంగంలోకి దిగనున్నారు. సినిమాకు హైలెట్గా నిలిచే కొన్ని యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించున్నారు. రామ్ చరణ్ కూడా షూటింగ్లో పాల్గోనడంతో సినిమా యూనిట్లో పండగ వాతావరణం నెలకొంది. దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు చరణ్.