టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచార్య. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతు ఎట్టకేలకు ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక విషయం ఏంటంటే? ఈ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్ గురించి మాత్రం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఆచార్య ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుందని, ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: కేజీఎఫ్2 సినిమాపై ప్రముఖ క్రిటిక్ రివ్యూ
మరి నిజంగానే ఈ వేడుకకు వీరిద్దరు వస్తున్నారా లేదా అన్నది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయకతప్పదు. ఈ మూవీ ట్రైలర్ ను మాత్రం ఈ నెల 12న విడుదల చేయనున్నామని యూనిట్ అధికారికంగా తెలిపింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, చెర్రీ సరసన హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.