ట్రిపుల్ ఆర్.. ఇండియన్ సినిమా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ. బాహుబలి తరువాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడం, టాలీవుడ్ టాప్ స్టార్స్ యన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటించిన మల్టీ స్టారర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.., వివిధ కారణాల చేత ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ వెనక్కి వెళ్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ట్రిపుల్ ఆర్ లో ఓ మంచి క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత సుమన్ టీవీతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె.. ట్రిపుల్ ఆర్ మూవీ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది.
“ట్రిపుల్ ఆర్ లో నేను.. యన్టీఆర్ నివశించే కాలనీలో ఉండే ఓ గృహిణి పాత్రలో నటించాను. ఒక సీన్ లో రామ్ చరణ్ క్యారెక్టర్.. యన్టీఆర్ క్యారెక్టర్ ని కోరడాతో కొట్టాలి. సెట్ లో అలా.. కొడుతూ చరణ్ పై నుండి కింద పడిపోయాడు. హీరోకి ఏమైందో అని మేమంతా టెన్షన్ పడ్డాము. కానీ.., చరణ్ మాత్రం వెంటనే మరో టేక్ కి రెడీ అన్నారు. అది చరణ్ గొప్పతనం. అదే సీన్ లో యన్టీఆర్ ని కొరడాతో కొట్టి.., ఆయనకి దెబ్బ తగిలితే.. రామ్ చరణ్ ఏడ్చేశాడు. తారక్ కి సారీ చెప్తూ.. తెగ ఫీల్ అయిపోయాడు చరణ్. ఇలా ఇద్దరూ ప్రాణ మిత్రులుగా ఉంటారు” అంటూ ట్రిపుల్ విశేషాలు బయట పెట్టింది సుజాత.
సీతారామరాజు.. కొమరం భీమ్ ని కోరడాతో ఎందుకు కొడుతాడు? తరువాత వారిద్దరూ ఎలా కలుస్తారు అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రేక్షకులకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. మరి.. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.