ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యసమస్యలు భరించలేక కొందరు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. వారి నిర్ణయాలతో కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది.
నేటి యువత జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను తట్టుకోలేక పోతున్నారు. ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ అప్పటికే ఒత్తిడికి గురై మానసిక ఆందోళన చెంది క్షణిక కాలంలో షాకింగ్ నిర్ణయాలను తీసుకుంటున్నారు. సమస్యలను ఎదుర్కొనలేక బంగారం లాంటి భవిష్యత్ ను పాడుచేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని వ్యక్తిగత సమస్యలతో బాధపడుతు ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. ఎంతో భవిషస్యత్ ఉన్న ఆమె చిన్నతనంలోనే తనువు చాలించింది. తమకు అండగా ఉంటుందనుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కూతురు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివారాలు ఇలా ఉన్నాయి.
ఎపిలోని మైదుకూరు మండలం నంద్యాలపేటలో విషాదం చోటుచేసుకుంది. సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ధనపాల ప్రియాంక అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజులుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతుంది. ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికి కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించకపోవడంతో తీవ్ర మనోవేధనకు గురైంది. నొప్పి భరించలేక విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన ధనపాల ప్రియాంక తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉద్యోగిని గురువారం కన్నుమూసిందని తండ్రి యుగంధర్ తెలిపాడు. ఈ విషయంపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందరితో కలివిడిగా ఉండే ధనపాల ప్రియాంకను తల్చుకుని సహోద్యోగులు, స్నేహితులు కన్నీరు కార్చారు. జిల్లా, మండల వ్యవసాయ శాఖ అధికారాలు మృతురాలి నివాసం వద్దకు చేరుకుని ఆమెకు నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.