ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అయితే మంత్రిగా ఎంతో హుందాగా కనిపించే ఆయన ఒక్కసారిగా డ్యాన్స్ చేయడంతో అంతా అవాక్కవుతన్నారు. విషయం ఏంటంటే..? మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహం హైదరాబాద్ లోని ఓ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతిమణి వైఎస్ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
అయితే వివాహ పాల్గొన్న సీఎం జగన్ నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇక వివాహ అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తెతో కలిసి స్టేజ్ పైన సై సినిమాలోని నల్లా నల్లాని పిల్లా అంటూ సాగే పాటకు మాస్ స్టెప్పులు వేశాడు. ఆయన చేసిన ఈ డ్యాన్స్ వీడియోను కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ ఏపీ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న విషయం తెలిసిందే.
— Uppula Naresh (@UppulaNaresh72) December 18, 2021