ప్రస్తుతం వానాకాలం సీజన్. ఎటు చూసిన వర్షాలే వర్షాలు. అయితే అటు సౌదీ అరేబియాలో ప్రస్తుతం వేసవి కాలం. ఎండలకు జనం అల్లాడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో జనం వేడి భరించలేకపోతున్నారు. దుబాయ్లో ప్రతి రోజూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ క్రమంలో దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల సాయంతో కృత్రిమంగా వర్షాలు కురిపించింది. అతి తక్కువ వర్షపాతంను అధిగమించడం కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ వర్షాలు పడేలా […]
కరోనా మహామ్మరితో పోరాటంలో ఎంతోమంది బాధ్యతగా వ్యవహరిస్తూ సాటివారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రెటీల నుంచి సామాన్యులు సైతం తామున్నామంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. వాళ్లు చేసే సాయం చిన్నదే అయినా ఎందరికో స్ఫూర్తి కలిగిస్తోంది. ఈ మహమ్మారి సమయంలో తోటివారిని ఆదుకోవడానికి చేస్తూ వస్తున్నారు. వారు చేసే సహాయం విలువ కన్నా వారిలో కనబడే మానవత్వ విలువలు చాలా ఎక్కువ. అటువంటి సహాయమే తమిళనాడులో కొందరు అందించారు. నాగపట్నంలో సోమవారం ఉదయం ఎస్ […]
కలియుగ వైకుంఠంగా, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమలలో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. వడ్డీకాసులవాడి సమక్షంలో ఓ బిచ్చగాడు లక్షాధికారి అయిన వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీవారి ఆలయన్ని, అక్కడికి వచ్చే భక్తులను నమ్ముకుని కొన్ని వందల మంది అనాథలు, బిచ్చగాళ్లు తిరుమలలో కాలం వెళ్లదీస్తున్నక్రమంలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.10లక్షలు దొరకడం స్థానికంగా సంచలనం రేపింది. నా అన్న వాళ్లెవరూ లేని అనాథ. అతని గది తెరచి చూస్తే రెండు ట్రంకు పెట్టెలు, […]
మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, […]
హ్యాకర్స్ సెలబ్రిటీల అకౌంట్స్పై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారనే విషయం తెలిసిందే. ఎవరోకరి సోషల్ మీడియా అకౌంట్లను లేదా పర్సనల్ బ్యాంక్ హ్యాక్ చేసి అవతలి వారి పర్సనల్ విషయాలను బహిర్గతం చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియాను ఎక్కువగా హ్యాక్ చేస్తుంటారు. ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. మధ్య కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ వరుసగా హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.ఛాన్స్ దొరికినప్పుడల్లా వారి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ […]
గుంటూరు జిల్లా సంగం డెయిరీ వ్యవహారంలో హైకోర్టు జగన్ సర్కార్కు షాకిచ్చింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని […]
చిత్తూరు జిల్లా బేస్ చేసుకొని నడిచే అమరరాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆ అమరరాజా సంస్థకు చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ సంస్థకు చెందిన చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనేపేరుతో చిత్తూరు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు […]