హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలి సంవత్సరాలలో మంచి లాభాలనే సాధించింది. అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. మెట్రో వేళలు పెంచినా రద్దీ పెరగడం లేదు. లాక్డౌన్ అనంతరం గ్రేటర్ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మెట్రో వేళలను పెంచారు. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను అంతగా ఆదరించడంలేదు. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో లక్ష […]
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. చాలా మంది బరువు పెరిగి పోతున్నామని వర్కౌట్స్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ తిండిని కంట్రోల్ చేసుకోలేరు. బరువు పెరగకుండా ఉండడానికి ‘వెయిట్ లాస్ డివైస్’ ని కనుగొన్నారు. అటువంటి వారికోసం ఈ డివైస్ బాగా పనికొస్తుంది. బరువు తగ్గడం కోసం సైంటిస్టులు ఒక వెయిట్ లాస్ డివైస్ ని కనుగొన్నారు. అది పళ్ళని క్లోజ్ చేసేస్తుంది. తినలేరు. కేవలం లిక్విడ్ మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. […]
బంగారాన్ని కుదవపెట్టి, అప్పు తీసుకుంటున్న వారిలో బాకీలు తీర్చని కేసులు పెరుగుతున్నాయి. ప్రముఖ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా టన్ను బంగారాన్ని వేలం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విలువ దాదాపు రూ.404 కోట్లు. సాధారణంగా బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ఏడాది కాలావధికి రుణాలు తీసుకుంటారు. గతేడాది లాక్డౌన్లు ముగిశాక, ఆర్థిక అవసరాల కోసం మూడో త్రైమాసికంలో పసిడి తనఖా రుణాలను ఎక్కువగా తీసుకున్నారని […]
కరోనా సెకెండ్ వేవ్ ఉతృతి, లాక్డౌన్ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు సినీ, టీవీ షూటింగులు జరపబోమని కార్మికులను సినీతారలు ఆదుకోవాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. కరోనా రెండో దశ అతి భయంకరంగా మారడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు ఆంక్షలు అమలు చేస్తుంది. దీంతో సినిమా పరిశ్రమ మరోసారి కష్టాల్లో పడింది సెల్వమణి వీడియా సమావేశంతో తెలిపారు. ప్రస్తుతం 18 సీరియళ్ల షూటింగులు జరుగుతున్నాయి. […]
భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈరోజు బంగారం కొని లక్ష్మీ దేవిని అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో వర్తిల్లుతుందని భక్తుల నమ్మకం. ఇవే కాకుండా ఈ పండగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు చేసే […]
డిజటల్ ఆస్తులకు, సైబర్ నేరస్థులు ద్వారా పొంచివున్న ప్రమాదం, సైబర్ బీమా అవసరాన్ని సూచిస్తుంది. ఈ పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, మాల్వేర్ దాడి, ఐటీ డేటా దొంగతనం, ఈమెయిల్ స్పూకింగ్, సైబర్ దోపిడి, సైబర్ స్టాకింగ్ వంటి 11 రకాల సైబర్ నేరలకు వ్యతిరేకంగా వ్యక్తులకు బీమా సౌకర్యాలను అందిస్తుంది. సైబర్ దాడి అనంతరం అయ్యే ఖర్చులను సైబర్ బీమా కవర్ చేస్తుంది. పాలసీ జాబితాలో పేర్కొన్న వివిధ రకాల […]
‘ఇండియన్ 2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా ఉండటంతో దర్శకుడు శంకర్ మరో రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపారు. ఇది లైకా నిర్మాణ సంస్థకు ఆగ్రహం తెప్పించింది. కమల్ హాసన్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2’. లైకా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టి ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు ఖర్చు చేసింది. అయితే, ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. తమ సినిమా షూటింగ్ పూర్తి […]
ఐపీఎల్ జట్లలో వరుస కరోనా కేసులు నమోదవడంతో.. ఐపీఎల్ 2021 సీజన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే అత్యధిక ఆదాయం బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నుంచే వస్తోంది. ఐదేళ్లకాలానికి స్టార్ స్పోర్ట్స్ రూ.16,347 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.3,369.40 కోట్లని బీసీసీఐకి చెల్లించాల్సి ఉండగా.. ప్రతి మ్యాచ్కీ రూ.54.50 కోట్లని ఇస్తోంది. అయితే.. ఐపీఎల్ 2021 సీజన్లో కేవలం 29 మ్యాచ్లు […]