ప్రస్తుతం భారత ప్లేయర్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఈ మెగా లీగ్ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా ఆస్టేలియా ప్రత్యర్థిగా భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ జరగబోతుంది. ఓ వైపు అందరూ ఐపీఎల్ ఆడుతుంటే పుజారా మాత్రం ఇంగ్లాడ్ కౌంటీల్లో సత్తా చాటుతూ బోలెడంత ఆత్మవిస్వాసాన్ని నింపుకుంటున్నాడు.
భారత క్రికెటర్ రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్ గురుంచి శుభవార్త అందుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్.. ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజుల తర్వాత పంత్ ఇంటికి వెళ్లనున్నాడు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు, కుటుంబసభ్యులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి […]
భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ మురళీ విజయం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడు. 2018 నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న మురళీ విజయ్ కొద్దిరోజుల క్రితమే బీసీసీపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు. బీసీసీఐతో అనుబంధం ముగిసిందంటూ.. విదేశీ లీగుల్లో ఆడటం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ప్రకటన చేశాడు. ఇది జరిగిన వారం రోజులకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. “బీసీసీఐతో నా అనుబంధం దాదాపు ముగిసింది. […]