మనిషి యవ్వనంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తట్టుకుంటారు. కానీ 60 దాటిన తర్వాత రక రకాల వ్యాధులు మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. వృద్దాప్యంలో సాధారణంగా నడక మారిపోవడం.. మతిమరుపు, నిద్రలేమి, మాట గట్టిగా మాట్లాడలేకపోవడం.. ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. 155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది. 1963లో జన్మించిన […]
మహమ్మారి సమయంలో ఎక్కువ గంటలు పనిచేయడం పెద్ద సమస్యగా మారింది. ఇంట్లోనే ఉండి పనిచేయడం వల్ల పనిభారం బాగా పెరిగిందని, ముఖ్యంగా పురుషులపై ఇది ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పశ్చిమ పసిఫిక్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో నివసించే మధ్య వయస్కులు, వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పింది. ఇంకా, 45-75 సంవత్సరాల వయసు వారిలో 60 పైబడ్డ వారు వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల గుండెపోటు వంటి […]
వచ్చే ఏడాది నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎసరు తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక వెల్లడించింది. సాఫ్ట్వేర్ రంగంలో 1.6 కోట్ల మందికిపైగా పనిచేస్తుండగా 2022 నాటికి 30 లక్షల మందిని తగ్గించుకోవాలని సంస్థలు భావిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఫలితంగా ఏడాదికి దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని తెలిపింది. భారత్ అవసరాల కోసం పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి సరాసరి వార్షిక వేతనం 25,000 డాలర్లు, అమెరికా అవసరాల […]
కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ రెండింటిలో ఏ వ్యాక్సిన్ను తీసుకున్నా శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే లక్నోలో ఓ వ్యక్తి కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై ప్రతాప్ చంద్ర ఫిర్యాదు చేశాడు. తాను కోవిషీల్డ్ డోసును తీసుకున్నప్పటికీ తనలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాలేదని తెలిపాడు. సీరమ్ సంస్థతోపాటు మరికొందరిపై అతను ఫిర్యాదు చేశాడు. లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. సీరమ్ సంస్థతోపాటు డీసీజీఏ డైరెక్టర్, […]
వైరస్ ను పూర్తిగా అంతం చేశామనుకున్న చైనాలోనూ ఇప్పుడు కొత్త వేరియెంట్ పుట్టుకొచ్చింది.గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆ భయమే వెంటాడుతుంది. ఫస్ట్ వేవ్ అయిపోయాక దాని పని అయిపోయిందనుకుంటే మరో వేరియెంట్ రూపంలో సెకండ్ వేవ్ లో విరుచుకుపడింది. మళ్లీ థర్డ్ వేవ్ కూడా ఉంటుందంటున్నారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. చైనా సరిహద్దు నగరం రూలీలో కరోనా విజృంభిస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మహమ్మారిని నిలువరించేందుకు మొత్తం […]
జపాన్ రాజధాని టోక్యోలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రధాని యోషిహిడే సూగా టోక్యోతో పాటు మరో 8 నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టోక్యో, ఒసాకా, క్యోటో, హ్యోగో, ఐచి, ఫ్యుకోకా, హొక్కైదో, ఒకాయామ, హిరోషిమా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూలైలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం జపాన్కు సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చితే జపాన్పై కరోనా వైరస్ వరుసగా దాడులు చేస్తోంది. ఈ మధ్యనే మూడోవేవ్ దాడి […]
లాక్డౌన్ కారణంగా దాదాపుగా అన్ని రంగాలూ ప్రభావితం అవుతున్నాయి. కరోనా ఉద్ధృతితో యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రస్తుతం మన దేశం అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. కొవిడ్ దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలు అయిన పరిస్థితి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు అమలు చేస్తోన్న లాక్డౌన్తో ప్రధానంగా చిరువ్యాపారులు చితికిపోతున్నారు. ఆదాయ వనరుగా ఎంచుకున్న వృత్తి కొనసాగే పరిస్థితి లేకపోవడంతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. ఇక సినిమా […]
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు. చిన్ననాటి నుంచి వివిధ వ్యాధులకు ఆకుపసర్లే వాడామని అవే తమలో రోగనిరోధకశక్తిని పెంచాయని చెబుతున్నారు. ఇప్పటివరకు తమకు మాస్కు వాడే అవసరం కూడా రాలేదని పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా నల్లమల అభయారణ్యం పరిధిలో చింతల గిరిజనగూడెం గ్రామస్తులు కరోనా చింత లేకుండా జీవిస్తున్నారు. సుమారు […]
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ భయంతో జపాన్ నగరం ఒసాకా వణికిపోతోంది. మరికొన్ని రోజుల్లోనే జరిగే ఒలింపిక్స్ వేడుకలకు సన్నద్ధం అవుతున్న వేళ వైరస్ భయం ఒసాకా నగరాన్ని వెంటాడుతోంది. వైరస్ ఉద్ధృతి పెరగడంతో జపాన్లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాతో […]