రోడ్ల మీద, ఒంటరి ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కన్నం వేసే వారు మరికొందరు. అంతేకాకుండా గుళ్లో దేవతా విగ్రహాలను కూడా వదిలిపెట్టడం లేదు.
బ్రిటీష్ వారి రాకపూర్వం వరకు మన దేశంలో చేనేత రంగం ఎంతో వైభవంగా వెలిగిపోయింది. మన నేతన్నల ప్రతిభ విదేశాలకు కూడా పాకిపోయింది. ఎన్నో రాజ్యాలకు మన దేశం నుంచి దుస్తులు ఎగుమతి అయ్యేవి. ఇక నేటి కాలంలో కూడా కొందరు నేతన్నలు అద్బుతమైన పని తీరుతో.. ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
మన దగ్గర సినీ తారలకు ఉండే అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమాన హీరో, హీరోయిన్ల కోసం ఏం చేయాడానికి అయినా వెనకాడరు. ఇక కొందరైతే.. తమ అభిమాన హీరో వాడిన వస్తువులు, దుస్తులు వంటివి సొంతం చేసుకోవడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఇంతకు ఏం చేశారంటే..
Gandhi: దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ దుర్గా దేవి విగ్రహం దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. దేశం మొత్తం దైవ సమానంగా భావించే గాంధీని కించపరిచేలా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. దుర్గాదేవి విగ్రహం వద్ద గాంధీలాగా ఉండే రాక్షసుడిని ఏర్పాటు చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్ ఆల్ ఇండియా హిందూ మహాసభ సభ్యులు కొందరు నవరాత్రుల సందర్భంగా కోల్కతాలోని రూబీ పార్కులో […]