Gandhi: దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ దుర్గా దేవి విగ్రహం దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. దేశం మొత్తం దైవ సమానంగా భావించే గాంధీని కించపరిచేలా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. దుర్గాదేవి విగ్రహం వద్ద గాంధీలాగా ఉండే రాక్షసుడిని ఏర్పాటు చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్ ఆల్ ఇండియా హిందూ మహాసభ సభ్యులు కొందరు నవరాత్రుల సందర్భంగా కోల్కతాలోని రూబీ పార్కులో ఓ దుర్గా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పుడా దుర్గాదేవి విగ్రహం దేశ వ్యాప్తంగా పెను వివాదానికి దారి తీసింది. దుర్గాదేవి విగ్రహంలో గాంధీ మహాత్ముడిని పోలిన ఓ విగ్రహాన్ని రాక్షసుడిలా ఏర్పాటు చేశారు. దుర్గాదేవి.. గాంధీ మహాత్ముడిని పోలిన ఆ విగ్రహాన్ని త్రిశూలంతో చంపుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులు దీన్ని తప్పుబట్టారు. రాక్షసుడి బొమ్మ ఉండాల్సిన చోట గాంధీ బొమ్మను పెట్టడం మంచి పద్దతి కాదని టీఎమ్సీ నేత కునాల్ గోష్ హెచ్చరించారు. ఇదే బీజేపీ అసలు స్వరూపమని, మిగితాదంతా ఓ డ్రామా అని పేర్కొన్నారు. గాంధీ మహాత్ముడు మన జాతికి తండ్రిలాంటి వారని ఆయన అన్నారు.
ప్రపంచం మొత్తం ఆయన్ని, ఆయన ఆలోచనల్ని గౌరవిస్తుందని చెప్పారు. అలాంటి గాంధీని అవమానపరిస్తే ఒప్పుకోమని, గట్టిగా నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. ఇక, ఈ ఘటనపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ ఆల్ ఇండియా హిందూ మహా సభ అధ్యక్షుడు చంద్రచూర్ గోస్వామి దీనిపై మాట్లాడుతూ.. ‘‘ హోం శాఖనుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆ విగ్రహం వివాదం గురించి మాట్లాడారు. విగ్రహం ముందు ఏర్పాటు చేసిన రాక్షసుడు గాంధీ లాగా ఉన్నాడని అన్నారు. దాన్ని తప్పుబట్టారు’’ అని చెప్పారు.
The Durga Puja idol organized by the Hindu Mahasabha in Kolkata’s Ruby Park has been designed to replace the Asura with Mahatma Gandhi.Let the police-administration immediately arrest the leaders and activists organizing the Hindu Mahasabha puja under the Sedition Act #DurgaPuja pic.twitter.com/L0oQfufX6b
— Soumyadipta Roy (@soumodiptoroyy) October 2, 2022
ఇవి కూడా చదవండి : అందంగా ఉన్న భార్య, కూతురు.. తట్టుకోలేని భర్త ఏం చేశాడంటే?