అప్పులు ఇచ్చేంత వరకు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అప్పు ఇచ్చాక అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టరు. అదేమని అడిగితే రేపు, మాపు అంటూ అప్పు ఇచ్చిన వాడికి చుక్కలు చూపిస్తుంటారు రుణ గ్రస్తులు. అదీ మనుషులైనా సంస్థలైనా, అడగడానికి వచ్చిన వారిపై దాడి చేస్తుంటారు.
బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో చాలా మంది సామాన్యులు మానసిక క్షోభ అనుభవిస్తుంటారు. మరికొందరు ఊరు విడిచి వెళ్లిపోవడం చేస్తుంటారు. ఇంకొందరు బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు వేధింపులకు యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతు పేటకు చెందిన […]
బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. జూన్ 27న సమ్మెకు దిగనున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె చేయనున్నారు. అన్ని యూనియన్ల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లును వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వచ్చిన బ్యాంకు ఉద్యోగులు.. ఇప్పుడు వారంలో ఐదు రోజుల పనిదినాలు కావాలని కోరుతూ సమ్మె […]