ఇటీవలే ఏపీ విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలు కొన్ని కుటుంబాల్లో విషాదాలు నింపాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని రాష్ట్ర వ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఇలా వారు తీసుకున్న నిర్ణయం తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారు. తాజాగా కడపలో కూడా విషాదం చోటుచేసుకుంది.
విద్యార్థి దశ.. అంటే ఎంత అందంగా ఉండాలి. భవిష్యత్తు ఏంటి.. ఏ మార్గంలో పయనిస్తే.. ఉన్నత శిఖరాలను చేరుకుంటాం.. అసలు జీవితంలో ఎలా ముందుకు సాగాలో నేర్చుకునే దశ. కానీ మరి నేటి విద్యార్థులు ఎలా ఉన్నారు. అసలు జీవితమంటే వారికి అర్థం తెలుసా అనిపించకమానదు కొన్ని సంఘటనలు చూస్తే.. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఇలానే అనిపిస్తుంది. ఆ వివరాలు..
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలల్లో బాలికలు పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ వారిదే పైచేయి. ఇక జిల్లాల వారీగా చూస్తే.. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల్లో కడప జిల్లా చివరి స్థానంలో ఉంటే, ఇంటర్ రెండో ఏడాది ఫలితాల్లో విద్యా శాఖ మంత్రికి చెందిన జిల్లా విజయనగరం చివరి స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
AP Inter Results 2023 Released: ఇంటర్ ఫలితాల విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. విద్యార్థుల కింద ఇవ్వబడిన లింకుల ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.