స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను వేణు ఊడుగుల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 1990ల్లో నక్సలిజం నేపథ్యంతో రూపొందించిన ఈ ప్యూర్ లవ్ అండ్ డ్రామా.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా సాయిపల్లవి, రానా సినిమాలోని క్యారెక్టర్స్ లో జీవించినట్లుగా అర్థమవుతుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రమోషన్స్ లతో బిజి బిజిగా గడిపేస్తుంది ‘విరాట పర్వం’ మూవీ టీమ్. ఈక్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ మూవీ, గో హత్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘విరాటపర్వం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సాయి పల్లవి ఎన్నో విషయాలు పంచుకుంటూ వచ్చింది. తనకు దైవ చింతన ఎక్కువ అని, దైవాన్ని నమ్ముతాను అని తెలిపింది. ఇలా తన పర్సనల్ విషయాలను ఎన్నో పంచుకుంది. తన ఇంట్లోనూ వాతారవణం అలానే ఉంటుందని చెబుతూ వచ్చింది. ఏ పని చేసినా సరే.. మంచి మనిషిలా బతకాలని, చేసే పనిలో మంచి ఉండాలని నమ్ముతామని తెలిపింది. సినిమాలో విషయాలను చెబుతూ నక్సల్స్ గురించి మాట్లాడింది. అది కాస్తా కాశ్మీర్ ఫైల్స్, గోహత్యల టాపిక్ మీదకు వచ్చింది. నక్సల్ గురించి సాయిపల్లవి మాట్లాడుతూ.. “వాళ్లది ఒక ఐడియాలజీ.. మనకు శాంతి అనేది ఓ ఐడియాలజి. నాకు వయలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుంది. వయలెంట్గా ఉండి ఏదైనా సాధించగలమని నేను నమ్మను.
Oka yuddham enno praanaalu theesthundi, kaani adhe yudham oka praanam posindi#VirataParvam Trailer out now❤️🔥
▶️ https://t.co/xJHrSWElTE@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #SureshBobbili #DivakarMani @dancinemaniac @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/di2P84TImE
— Rana Daggubati (@RanaDaggubati) June 5, 2022
కొన్ని రోజుల క్రితం “కశ్మీర్ ఫైల్స్” అనే సినిమా వచ్చింది కదా? అందులో కశ్మీర్ పండిట్స్ ని ఎలా చంపారో చూపించారు. అయితే.. ఇప్పుడు మనం దానిని కేవలం మత ఘర్షణలా చూస్తే ఎలా? మరి.. మొన్నటికి మొన్న బండిలో ఆవుని తీసుకెళ్తున్నారని డ్రైవర్ ను కొంతమంది కొట్టి చంపి జైశ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? ఇక్కడ సమస్య మతాలు కాదు. మనం మంచి వ్యక్తిగా ఉంటే.. ఇతరులను బాధించం. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడ ఉంటుంది?” అని తెలిపారు.
అయితే సాయిపల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై నెట్టింట్లో దుమారం రేగుతోంది. సాయి పల్లవి మీద దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. చరిత్ర తెలియకుండా వాగకు, లక్షల మంది కశ్మీర్ పండిట్స్ మరణాల పట్ల అవగాహన లేకుండా ఎలా మాట్లాడతావు? ఆ మాత్రం జ్ఞానం లేదా? అంటూ సాయిపల్లవిపై జాతీయవాదులు మండిపడుతున్నారు. మరి.. సాయిపల్లవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Decided not to watch #VirataParvam #buycotVirataParvam https://t.co/7y8uVXncdt
— Ramesh Sriram (@iamrameshsriram) June 14, 2022
#SaiPallavi : Whitewashing the Genocide. Comparing the killing of Smugglers with Killing of Kashmiri Pandits. Shame on you.
I remember Dr. @Swamy39 said cinema walonko dimaag nhi, you’re proving it.#VirataParvam https://t.co/c8ViYTL1hp— Parthasaradhi (@PaRtHaINDIAN1) June 14, 2022