ఆమె స్టార్ హీరోయిన్. ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. చాలా ఏళ్ల క్రితమే టాప్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పుడు తన భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.
హీరోయిన్లు ఒకప్పుడు చాలాతక్కువగా మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం కాస్త ఓపెన్ అవుతున్నారు. తమ తమ అభిప్రాయాల్ని చాలా నార్మల్ గా చెప్పేస్తున్నారు. అలా కొన్నిసార్లు అవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కూడా అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ గా కూడా ఏకంగా తన భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఆయనే చాలామంది హీరోయిన్లతో చేస్తున్నారు. మరి తానెందుకు చేయకూడదు అంటూ క్వశ్చన్ చేసింది. ఇంతకీ ఈ నటి ఎవరు? ఆమె భర్త హీరోయిన్లతో చేస్తున్న వర్క్ గురించి కూడా చెప్పుకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పై వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అయిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు మంచి మంచి సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. తాజాగా ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటించింది. మార్చి 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు తెగ కష్టపడుతోంది. ఇలాంటి టైంలో లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన రాణీ ముఖర్జీ, తన భర్త గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బాలీవుడ్ టాప్ నిర్మాత అయిన ఆదిత్య చోప్రాను రాణీ పెళ్లి చేసుకుంది. ఆయనకు సొంత నిర్మాణ సంస్థతో పాటు డిస్ట్రిబ్యూషన్ హౌస్, స్టూడియో కూడా ఉంది.
‘నా భర్త చాలామంది హీరోయిన్స్ తో పనిచేస్తారు. మరి నేను ఇతర నిర్మాతలతో ఎందుకు కలిసి పనిచేయకూడదు? నాకు మంచి స్క్రిప్ట్ కావాలి. యష్ రాజ్ ఫిల్మ్స్ అయినా ఏదైనా సరే నాకు ఓకే. నా కొత్త మూవీ చూసి నా భర్త ఆదిత్య చోప్రా చాలా ఎమోషనల్ అయ్యారు. ఏదైనా మూవీ చూసి ఆయన చలించిపోవడం అనేది చాలా తక్కువసార్లు జరుగుతుంది. ఆయన నా యాక్టింగ్ చూసి చాలా మెచ్చుకున్నారు.’ అని స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రాణీ ముఖర్జీ కామెంట్స్ వినగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.