స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్, పంజాబీ భామ చార్మీల మధ్య ఏదో ఉందంటూ చాలాకాలంగా ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి స్నేహం గురించి టాలీవుడ్ లోను రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి. వీరిద్దరు కలిసి పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణా సంస్థను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈక్రమంలో వీరిద్దరూ అనేక సార్లు బయట పార్టీల్లో కనిపిస్తుంటారు. దీంతో వీళ్ల మధ్య ఏదో నడుస్తోందని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు. ఇంక ఓ అడుగు ముందుకేసి చార్మీ కోసం పూరీ జగన్నాథ్ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు రాసుకొచ్చారు. అయితే తాజాగా ఈ రూమర్స్ పై పూరీ తనయుడు హీరో ఆకాశ్ పూరీ స్పందించారు.
హీరో ఆకాష్ పూరీ నటించిన చోర్ బంజార్ చిత్రం జూన్24 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఆకాష్.. ఈచిత్రానికి సంబంధించిన విశేషాల గురించి తెలియజేశారు. మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆకాష్ పూరీకి పూరీ విడాకుల గురించి ప్రశ్నలు తలెత్తడంతో వాటిపై రియాక్ట్ అయ్యారు. ఆకాష్ మాట్లాడుతూ..” అమ్మనాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్టు మమ్మీనే. వాళ్లది లవ్ మ్యారేజ్. కొందరు పనిలేని వాళ్లు టైంపాస్ కోసం అమ్మనాన్న విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ వార్త అయితే నిజం కాదు. నాన్న పరిస్థితి అస్సలు బాలేనప్పుడు.. ఆ విషయాలు మాకు తెలియకుండా అమ్మ ముందే జాగ్రత్తపడింది. మేం బాగా చిన్నపిల్లలగా ఉన్నప్పుడే హాస్టల్లో పెట్టేసింది. నేను మూడోతరగతి.. చెల్లి రెండో తరగతి చదువుతుంది. మేం అయితే ఇవేం తెలియకపోవడంతో చాలా హ్యాపీగా ఉన్నాం. మేము తిరిగి మంచి స్థితికి వచ్చాం అంటే కారణం అమ్మే.
మీకు ఇక్కడ ఇంకో నిజం చెప్తాను.. మా పేరెంట్స్ లవ్లో ఉన్న సమయంలో నాన్న.. అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు నిజంగా ఉంటారా? అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. మరి.. హీరో ఆకాష్ పూరీ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.