వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే ఎంగేజ్ మెంట్ జరుపుకోనున్నారని తెలుస్తోంది. రాజకీయ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోనున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు వంగవీటి రాధా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. త్వరలో ఎంగేజ్మెంట్ జగనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన యువతితో పెళ్లి కుదిరినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై స్పష్టమైన ప్రకటన ఏమీ చేయలేదు. నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల కుమార్తె జక్కం పుష్పవల్లిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
రాబోయే మూడు రోజుల్లో నర్సాపురంలో నిశ్చితార్థం ఉంటుందని.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పెళ్లి జరగనుందని వంగవీటి రాధా సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. అయితే రాధా వివాహంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పటి నుంచో అభిమానులు వంగవీటి రాధా వివాహం చేసుకుంటారని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏకంగా పెళ్లి వార్తలు రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వంగవీటి రాధా రాజకీయాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత వంగవీటి రాధా రాజకీయాలకు దూరంగా ఉంటూ కొన్ని రకాల కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు.