ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు.. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇటీవలే విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం జగన్.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు.
జగనన్న విద్యాకానుకలో అందించే కిట్లను వచ్చే 2023-24 విద్యా సంవత్సరం నుంచి అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. జగనన్న విద్యాకానుక పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, షూలు, సాక్స్, బెల్టు, బ్యాగ్ తో కూడిన కిట్ను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వస్తువులను మరింత నాణ్యమైనవి అందించేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలుకు పేరెంట్స్ కమిటీలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. అలా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాపట్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘జగనన్న విద్యాదీవెన’ మూడవ విడత నిధులను బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని జగన్, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 11.02 లక్షల మంది విద్యార్థులకు గాను రూ. 694 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పిల్లలకు […]
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే పేపర్ లీకేజ్ కలకలం రేపింది. మొదటి రోజు నుంచి వరుసగా ప్రశ్నపత్రలు వాట్సాప్ లో దర్శనమిస్తూ అందరిని ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేశాయి. దీనికిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో టెన్త్ పేపర్ లీక్ పై […]