ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు.. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇటీవలే విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం జగన్.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించారు. అంతేకాక చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు .. అందరికి వివిధ పథకాల రూపంలో సాయం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతకు.. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఇలా ఇటీవలే జగనన్న వసతి దివెన పథకం కింద నగదు విద్యార్ధుల ఖాతాలో జమ చేసి గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా సీఎం జగన్ విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు.
పేద విద్యార్థుల చదువులకు ఆటకం కలుగకుండా జగన్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తుంది. అలానే పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాల రూపు రేఖాలను వైసీపీ ప్రభుత్వం మార్చేసింది. పిల్లల చదువులు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని.. స్కూల్ కి వెళ్లేందుకు అవసరమైన ప్రతిదీ జగన్ ప్రభుత్వం అందిస్తుంది. మీ పిల్లల బాధ్యత నాదే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల విద్యార్థులకు ఏటా విద్యా కానుకు అంద జేస్తున్నారు. ఈ ఏడాది స్కూళ్లు ప్రారంభమైన తొలి రోజే విద్యాకానుక అందించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం వేసవి సెలవు ప్రారంభం కాగా.. జూన్ 12న తిరిగి పాఠశాలల తెరుస్తారు. అదే రోజు విద్యార్థులకు విద్యాకానుక అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. విద్యా కానుక అందించే విషయంలో ఎలాంటి ఆలస్యానికి తావుండకూదని సీఎం స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాలల్లో నాడు-నేడుకు సరిపడా నిధులు ఉన్నాయని తెలిపారు. అలానే తల్లిదండ్రుల కమిటీల అకౌంట్లలో రూ.734.21 కోట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్ ఖర్చుల కోసం మరో రూ.1400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.
ఇక, పాఠశాల్లో డిజిటిలీకరణ కూడా పూర్తవుతుందన్నారు. స్కూల్ ప్రారంభంమయ్యే లోపు ఐఎఫ్ఎస్ ప్యానెళ్ల బింగింపు పూర్తి కావాలని అధికారులకు ఆదేశారు జారీ చేశారు. స్కూళ్లు జూన్ 12న తిరిగి ప్రారంభిస్తారని, అదే రోజు విద్యార్థులకు విద్యా కానుక అందించాలని.. ఇందులో ఎలాంటి అలసత్వానికి తావుండకూడదని ఆయన తెలిపారు. దాదాపు రూ.43.01 లక్షల మందికి జగనన్న విద్యా కానుక అందుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మరి.. విద్యా కానుకపై సీఎం జారీ చేసిన తాజా ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.