పదో తరగతికే సంబరాలా..? అని మీరు అనుకోవచ్చు. ఎంత పైచదువులు చదవాలన్నా పదో తరగతి కీలకం. పాస్ కాకుంటే చదువుకు ఇక్కడే ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే ఓ విద్యార్ధి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించడం కోసం తెగ కష్టపడ్డాడు. మొత్తానికి పాసయ్యాడు. అందుకే అతని పడ్డ కష్టం నలుగురికి తెలిసేలా అతని మిత్రులు సంబరాలు చేశారు.
ఇటీవల కొంతకాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలో హారీష్ రావు ఏపీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన మాటలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి .. ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.
'పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకొచ్చినా..' తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సక్సెస్ స్టోరీ ఇది. ఈ విషయం ఆయన ఎన్నోమార్లు.. ఎన్నో ప్రసంగాల్లో వినిపించారు. అయినప్పటికీ ఓ మహిళ.. ఆయనను ఇదే విషయం అడుగుతూ ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో ఆయన సదరు మహిళకు ఏమని సమాధానమిచ్చారో.. మీరూ చూడండి.