తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ క్రాష్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మొదటి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా ప్రాణాలు విడిచినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. గాయాలను తట్టుకోలేక బుధవారం ఉదయం వరుణ్ సింగ్ తుదిశ్వాసను విడిచినట్లు వెల్లడించింది. IAF is deeply saddened […]
ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు వదిలిన తెలుగుతేజం లాన్స్నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా, కురబలకోట మండలంలోని ఎగువరేగడ గ్రామంలో.. సాయితేజ భౌతిక కాయాన్ని జనాలు సందర్శించిన తర్వాత సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయమే సాయితేజ పార్థివదేహాన్ని బెంగుళూరులోని బేస్ క్యాంపు నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో చిత్తూరుకు తరలించారు. Officials, college students and locals in #Madanapalle, #Chittoor district escorting the ambulance carrying the […]
త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన భార్య మధులిక సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్ సమీపంలో కూలిన ఘటనలో 13 మంది దుర్మణం పాలయిన ఘటన యావత్ భారతాన్ని కన్నీటిపర్యంతం చేసింది. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురుబకోట మండలం ఎగువరేగడ గ్రామానికి […]