ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు వదిలిన తెలుగుతేజం లాన్స్నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా, కురబలకోట మండలంలోని ఎగువరేగడ గ్రామంలో.. సాయితేజ భౌతిక కాయాన్ని జనాలు సందర్శించిన తర్వాత సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయమే సాయితేజ పార్థివదేహాన్ని బెంగుళూరులోని బేస్ క్యాంపు నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో చిత్తూరుకు తరలించారు.
Officials, college students and locals in #Madanapalle, #Chittoor district escorting the ambulance carrying the mortal remains of Lance Naik B Sai Teja to his village Eguvaregadipalle. @NewsMeter_In @CoreenaSuares2 pic.twitter.com/fUWchKcZRN
— Srilakshmi Muttevi (@SriLakshmi_10) December 12, 2021
కర్ణాటక – ఆంధ్ర సరిహద్దులోని చీకల బైలు నుంచి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. జై జవాన్ అంటూ.. జాతీయ జెండాలు చేతపట్టి యువకులు పెద్దఎత్తున అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఈ అంతిమయాత్ర అనంతరం మధ్యాహ్నం ఎగువరేగడ గ్రామంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఎగువరేగడ గ్రామంలో సుమారు 2ఎకరాల స్థలంలో సాయితేజ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. సైనిక లాంఛనాలతో సాయితేజకు తుది వీడ్కోలు పలకనుంది ఇండియన్ ఆర్మీ. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ సాయితేజ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నందున పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బరువెక్కిన హృదయాలతో ఎగువరేగడ ప్రజలు సాయితేజ పార్థీవ దేహానికి నివాళులు అర్పించనున్నారు.
The mortal remains of Lance Naik B Sai Teja, who died in #TamilNaduChopperCrash reached #madanapalle enroute to his hometown in Kurbalakota mandal in #Chittoor district in #AndhraPradesh @NewIndianXpress pic.twitter.com/hWjWhD2qUv
— TNIE Andhra Pradesh (@xpressandhra) December 12, 2021