ఈ మధ్యకాలంలో కారులో మంటలు తరుచుగా జరుగుతున్నాయి. ఎండాకాలంలోఅయితే ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువగా చోటుచేసుకంటున్నాయి. ఖరీదైన కారు అయిన సరే ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా నంద్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు మంటల్లో తగలబడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నగరం నడిబొడ్డున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లక్డికపూల్ చౌరస్తాలో రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి కారు నుంచి పొగలు రావడం.. అందరూ చూస్తుండగానే మంటలు అంటుకున్నాయి. కారులో ఉన్న వారు వెంటనే అలెర్ట్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో చుట్టూ పక్కల భారీగా టాఫిక్ జామ్ అయ్యింది. ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
షాద్ నగర్- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. అందులోను వాహనాలకు నిప్పు అంటుకుని కాలిపోతున్న సంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాగే కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. రంగారెడ్డి జిల్లాలో కారుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారు పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో […]