మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో పాల్గొనబోయే పార్టీలు అప్పుడే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా జనసేనా అధినేత వారాహి యాత్రను చేపట్టారు. ఏళూరులో జరిగిన సభలో వాలంటీర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఎల్ఎ ఆళ్ల వినూత్నంగా నిరసన తెలిపారు.
కరోనా అంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వెన్నుల్లో వణుకు పుడుతుంది. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే కరోనా బారిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా వేలాది మందికి కోవిడ్ సోకింది.. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఏపిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా […]
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పి రావడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు. వెంటనే ఆయనకు చికిత్స అందించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన నియోజకవర్గంలో అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు రామకృష్ణారెడ్డి. పలు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కాగా, నిన్న మంగళగిరి-తాడేపల్లి పరిధిలోని పలు అభివృద్ధి […]