కరోనా అంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వెన్నుల్లో వణుకు పుడుతుంది. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే కరోనా బారిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా వేలాది మందికి కోవిడ్ సోకింది.. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఏపిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే..
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నా.. భారీ సంఖ్యలోనూ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు, కరోనా బాధితుల మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర అన్ని రాష్ట్రాల్లో కరోనా హెచ్చరికలు జారీ చేసింది.. మాస్క్ తప్పని సరి అంటుంది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కరోనా టెన్షన్ మొదలైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు కరోనా పాజిటీవ్ రాగా.. మరో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది.
కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తమను కలిసినవారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సైతం కోవడిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తం అయ్యింది.. మాస్క్ తప్పకుండా దరించాలని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలకు సూచించింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Squirrel: సత్యసాయి జిల్లా ఆటో ప్రమాదం: ఉడతకు శవ…