చెన్నై క్రైం- తల్లిదండ్రులు దైవంతో సమానం. ఆ తరువాత అంతటి స్థానం ఆచార్యుడిది. అంటే ఉపాధ్యాయుడిని కూడా దైవంతో పోలుస్తాం మన భారత దేశంలో. టీచర్స్ కు అంతటి విలువ, గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు జన్మనిస్తే, ఉపాధ్యాయుడు మంచి బుద్ది, మంచి నడవడిక, విద్య నేర్పించి ప్రయోజకులను చేస్తారు. తమ వద్దకు వచ్చే పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది. అంతటి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కొందరు ఆ వృత్తికే కలంకం తెస్తున్నారు. కన్న బిడ్డల్లాగ చూసుకోవాల్సిన విధ్యార్ధినుల పట్ల కొంత మంది టీచర్స్ పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయులు కామంతో కన్నుమిన్ను కానక, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ కోర్కెల కోసం విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసికంగా హింసిస్తున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక టీచర్ విద్యార్థులను లైంగికంగా వేధించిన సంఘటన కలకలం రేపుతోంది. దీంతో ఆ టీచర్పై సస్పెన్షన్ వేటు పడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఘటన మరువకముందే మరో ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. విద్యార్థులకు కామర్స్ బోధించే ఉపాధ్యాయడు కొన్ని సంవత్సారాలుగా విద్యార్థినులకు వేధిస్తున్నట్లు ఆలస్యంగా తెలిసింది. ఆ ఉపాధ్యాయుడి బారిన పడిన విధ్యార్ధినులు ఒకొక్కరిగా వచ్చి పూర్వ విద్యార్థుల సంఘాలనికి ఫిర్యాదు చేస్తండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడు ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 500 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించాడట. దీంతో వెంటనే ఆ ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విషయాన్ని ఓల్డ్ స్టూడెంట్స్ అసోషియేషన్ కు పాఠశాల యాజమాన్యం ఈ మెయిల్ ద్వారా తెలిపింది.
ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని అంతర్గత కమిటీకి ఆదేశాలిచ్చింది స్కూల్ మేనేజ్ మెంట్. కమిటీ నిజా నిజాలను తెలుసుకొని విచారణను పూర్తి పారదర్శకంగా జరిపేట్లు ఆదేశించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఫిర్యాదు చేసిన వారు ఆ కీచక ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధించడంచో పాటు, బెదిరింపులకు పాల్పడేవాడని విధ్యార్ధినిలు చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు తమను దగ్గరకు తీసుకొని ఒళ్లో కూర్చోబెట్టుకునే వాడని, అంతే కాకుండా ఎక్కడపడితే అక్కడ తాకుతూ ముద్దులు పెట్టేవాడని చెప్పుకొచ్చారు. ఆయన ప్రవర్తనపై ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతామంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విధ్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు తదితర కేసులు నమోదు చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.