తెలుగు చలనచిత్ర రంగంలో మెగా ఫ్యామిలీ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మెగా కంపౌండ్ లో ఒక క్రికెట్ టీమ్ కి సరిపోయేంత మంది హీరోలు ఉన్నారు. ఇక మెగా బాస్ చిరంజీవి ఈ కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి ఎంత మందికి ప్రాణదాత అయ్యారు. మిగిలిన మెగా హీరోలు కూడా తమకి తోచినంతలో సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈ కష్ట కాలంలో అన్నయ్య చిరంజీవి చాలా పెద్ద మనసుతో ముందకు వచ్చాడు. డబ్బు విషయంలో వెనకాడకుండా అన్నయ్య చేస్తున్న సేవ అద్భుతం. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా.., మేము, మా పిల్లలు కూడా చాలా మందికి సహాయం అందించాము. కొంత మందికి వైద్యం కోసం సహాయం చేశాము. కష్ట కాలంలో వారికి అండగా నిలబడ్డందుకు తృప్తిగా అనిపించింది అని నాగబాబు తెలియచేశాడు. కానీ.., ఇదే సమయంలో నాగబాబు తన అన్న కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడం విశేషం.
మా కుటుంబం నుండి ప్రజలకి అందిన సహాయం ఒక ఎత్తు అయితే.., ఉపాసన నుండి అందిన సహాయం మరో ఎత్తు అని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఉపాసన చేసిన సాయం అంతా అపోలో ఆస్పత్రి ద్వారా సైలెంట్ గా జరిగిపోయింది. నిజం చెప్పాలంటే అపోలో చాలా పెద్ద కార్పొరేట్ హాస్పటల్. కానీ.., కరోనా ట్రీట్మెంట్ విషయంలో అపోలో మానవత్వాన్ని చాటుకుంది. మిగతా అన్నీ ఆస్పత్రిల్లోలా లక్షలకి లక్షలు బిల్స్ వేయలేదు. పేషంట్స్ కి చాలా తక్కువ కాస్ట్కి కరోనా ట్రీట్ మెంట్ అందించారు. ఇందుకే అపోలోపై ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని నాగబాబు తెలియచేశారు. ఈ విషయంలో ఉపాసనతో తాను చేసిన సంభాషణని కూడా చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్. ” ఏమ్మా ఇంత తక్కువకి ఎలా చేస్తున్నావ్ అని అడిగితే.. నార్మల్ టైంలో మనం కమర్షియల్గా ఉన్నప్పటికీ, ఇలాంటి టైంలో సాయం చేయాలని ఉపాసనతో తనతో చెప్పినట్టు నాగబాబు తెలియచేశాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న చాలా సేవా కార్యక్రమాలకి గైడ్ కూడా ఉపాసనే కావడం గమనార్హం. సినీ కార్మికులందరికీ చిరంజీవి వ్యాక్సిన్ వేయించారంటే అది ఉపాసన సాయంతోనే. ఈ కారణంగానే ఉపాసన మా అన్నయ్యకి తగ్గ కోడలు అంటూ కితాబు ఇచ్చాడు నాగబాబు.