కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన వందే భారత్ రైళ్ల పట్ల ప్రజాధారణ పెరుగుతోంది. కాగా వందే భారత్ రైళ్ల రంగును మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఇంతకు ముందు తెలుపు, నీలం రంగులో కనిపించిన వందే భారత్ ఇకపై కాషాయ రంగులో కనిపించనుంది.
వేగవంతమైన ట్రైన్లను నడపాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ రైల్వే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దానిలో భాగంగా పలు మార్గాల్లో ట్రైన్లను ప్రారంభించింది. ఇప్పుడు మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు 80 వందే భారత్ ట్రైన్లకు ఆర్డర్ ఇచ్చింది.