ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి వరదలు ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటి వరకూ 22 మంది మరణించారు. కాగా ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది.
ఉత్తరాఖండ్- దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జలవిలయానికి మొత్తం 42 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారులన్నీ మూసుకుపోయాయి. నదులపై ఒకటి రెండు చోట్ల వంతెనలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సహాయక చర్యలకోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. నైనిటాల్ నగరానికి దారితీసే మూడు […]