కట్టెలు కొట్టుకునే వ్యక్తి గొడ్డలి నదిలో పడిపోతే గంగమ్మ తల్లి బంగారు గొడ్డలి తెచ్చి ఇచ్చినట్టు మనం చిన్నప్పుడు విన్నాం. నిజ జీవితంలో ఇలాంటి కథలు నిజం కావని అనుకుంటారు. కానీ అదృష్టం ఉంటే కొందరికి కథలూ నిజమవుతాయి, కలలూ నిజమవుతాయి. దీనికి నిదర్శనమే మధ్యప్రదేశ్కు చెందిన గిరిజన మహిళ. అడవి తల్లినే నమ్ముకుని జీవనం సాగించే ఆ మహిళను ఆ అడవి తల్లి రూపంలో అదృష్టం వరించింది. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ గిరిజన మహిళ కట్టెల […]
సాధారణంగా భక్తితో దేవుడికి మొక్కులు చెల్లించుకుంటే తమకు మంచి జరుగుతుందని అందరూ భావిస్తుంటారు. ముడుపులు కట్టి తమ ఇష్ట దైవానికి చెల్లించుకుంటారు. భారత దేశంలో దైవ భక్తి.. దైవ చింతన కలిగినవారు ఎక్కువగా ఉంటారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ‘ఖాందేవ్’ ఆలయంలో ఓ ఆదివాసీ మహిళ ‘నూనె మొక్కు’ చెల్లించుకుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టి పాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఒకేసారి తాగింది. మంగళవారం (జనవరి 18) ఖాందేవ్ జాతర సందర్భంగా […]