దేశంలో ఎంతో మంది తమ అద్భతమైన మేథస్సుతో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది వెలుగులోకి వస్తున్నారు.. మరికొంత మంది తమకు ఎంత టాలెంట్ ఉన్నా సరైన ప్రోత్సాహం లేక వెలుగులోకి రాలేకపోతున్నారు.
రోజు రోజుకి కాలుష్యం ఎక్కువై పోతోంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, వాహనాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీ లో ఉండే వ్యర్ధ పదార్ధాలని నదుల్లోకి వదలడం ఇలా అనేక కారణాల వల్ల కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఏది ఏమైనా వీటిని అదుపు చెయ్యాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. దీనితో పవిత్రమైన నదులు కూడా వ్యర్థ పదార్థాల తో నిండి పోతున్నాయి. కేవలం అక్కడే […]