రోజు రోజుకి కాలుష్యం ఎక్కువై పోతోంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, వాహనాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీ లో ఉండే వ్యర్ధ పదార్ధాలని నదుల్లోకి వదలడం ఇలా అనేక కారణాల వల్ల కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఏది ఏమైనా వీటిని అదుపు చెయ్యాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. దీనితో పవిత్రమైన నదులు కూడా వ్యర్థ పదార్థాల తో నిండి పోతున్నాయి. కేవలం అక్కడే కాదు ఎక్కడ చూసుకున్నా ఇదే దుస్థితి ఏర్పడింది.
ఢిల్లీ నగరం లోని వివిధ పరిశ్రమల వ్యర్థాలను యమునా నది లోకే విడుదల చేయడంతో ఆ నది లోని నీరు మొత్తం కాలుష్యం అయిపోతోంది. ఇప్పటికే నది లోని నివసించే చేపలు మొదలు అనేక నీటి జీవులు మృత్యువాత పడుతున్నాయి. యమునా నదిలో నీటి పైన విషపు మురుగు పైకి తేలుతుంది. నీటిపైన చాలా భాగంలో ఈ విషపు మురుగు పైన తేలుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కలిదిండి గింజి అనే ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుండి ఈ విష పురుగు దర్శనమిస్తోంది.
దేశంలోని చాలా నదులు పరిశ్రమల వల్ల కలుషుతం అవుతున్న సంగతి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నదులన్నీ కలుషితం అవుతున్నాయని గత కొద్ది రోజులుగా ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలానే రోజూ నది లో చేరే అనేక రసాయన వ్యర్థాల వల్ల నీరు విషతుల్యంగా మారడం కూడా చూస్తున్నదే. ఇలా రోజు రోజు వ్యర్ధాలు ఎక్కువై పోతుండడం తో నీటి ఉపరితలం పై తెల్లటి విషపు నురగలు పేరుకు పోతున్నాయి.
ఏది ఏమైనా ఈ రసాయన వ్యర్థాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. నదుల్లో చెత్తాచెదారం కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు యమునా నదిలో పైభాగాన విషపు నురుగు కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.