ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘అసని’ తుపాను ప్రభావంతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను కాస్త బలహీన పడినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది. మొదట మచిలీపట్నం వద్ద తీరందాటుతుంది అని భావించినా ఆ తర్వాత శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా దిశ మార్చుకుని నర్సాపురం వైపు తీరందాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో […]
ఏపీలో అసనీ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలం, ఎం సున్నాపల్లి సముద్రతీరానికి ఒక రథం కొట్టుకువచ్చింది. బంగారు వర్ణం కలిగిన రథం అక్కడి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. ఆ రథాన్ని అక్కడ ఉన్న కొంత మంది తాళ్ళతో కొట్టి ఒడ్డుకు లాగుతూ వచ్చారు. తీరంలో బంగారు వర్ణం రథం గురించి తెలియగానే అదో పెద్ద వింత వస్తువులా స్థానికులు వీక్షించేందుకు భారీ సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. […]