ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాగానే సామాన్యుల కాళ్ళు అరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. పని చేసి పెట్టమంటే.. ‘మాకేంటి అహ మాకేంటి’ అని లంచం అడుగుతారు. ఇలా లంచం తీసుకుంటూ బయటకు రాని వారు కొందరైతే.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారు కొందరు. తాజాగా ఓ మహిళా ఉద్యోగి కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది.
ఏపీలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం నకిలీ చలాన్ల అంశంపై స్పందించారు. నకిలీ చలాన్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రూ.40 లక్షలు రికవరీ చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప వ్యవహారం వెలుగులోకి రాలేదని సీఎం జగన్ […]