శ్రీకాకుళం జిల్లా జంట హత్యల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల కారణంగానే మూడు ప్రాణాలు గాలిలో కలిసి పోయాని కొందరు వాపోతున్నారు. అయితే మృతుడు సంతోష్ కుమార్ మరణంపై తల్లి స్పందించి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె ఏం చెప్పిందంటే?
ఏపీలో జంట హత్యల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వదినతో మరిది సంబంధం అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వదినతో మరో యువకుడు చనువుగా ఉన్నాడనే కారణంతో మరిది ఆ యువకుడిని దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కొందరు గ్రామస్తులు స్పందించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.