ఈ మద్య రైలు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని మానవ తప్పిదాలు ఉంటే.. సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక వేసవి కాలంలో తరుచూ రైల్లో మంటలు వ్యాపిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జంక్షన్లో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కబోతున్న ఒక జవాన్ను టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) కిందకి తోసేశాడు. ఈ ప్రమాదంలో సదరు జవాన్ రెండు కాళ్లు కోల్పోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హేయమైన చర్యకు పాల్పడ్డ సదురు టీటీఈని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం.. బాధితుడు సోను కుమార్ దిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ బి8 బోగిలోని థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్నాడు. అయితే, బరేలీ స్టేషన్లో […]