గత కొంత కాలంగా అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు, సాదు జంతువులు పట్టణాలు, గ్రామాల్లోకి రావడం చూస్తునే ఉన్నాం. ఎక్కువగా చిరుత, పులి, ఎలుగు బంట్లు గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, మేకలపై దాడులు చేసి చంపేసి తింటున్నాయి. కొన్నిసార్లు ఇవి మనుషులపై కూడా దాడి చేసిన చంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం మరీ ఎక్కువ అయ్యాయని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఏ క్షణంలో తమపై దాడులు చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని.. ఇప్పటికే పలువురు వీధి కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటమే కాదు.. చనిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు.