చాలా మంది దేవుళ్లపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. అందుకే నిత్యం దైవ పూజ, దైవ దర్శనాలు చేస్తుంటారు. ఇలా దేవాలయాలు దర్శించిన సమయంలో విరాళాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపార వేత్త ఆలయ నిర్మాణానికి రూ.250 కోట్ల విరాళం ఇచ్చారు.
ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తమ సామర్థ్యం మేరకు భక్తులు స్వామి వారికి విరాళం సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి భారీ విరాళం అందించారు.