భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. నష్టం వచ్చినా ఎంత కష్టమైనా రైతులు వ్యవసాయం చేయడం మాత్రం మానుకోరు. భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంటలు పండించి దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.
అకాల వర్షాల కారణంగా.. రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట.. చేలోనే తడిసి.. వాన నీటిలో కొట్టుకుపోతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతన్నలు ఉన్నారు. ఈ క్రమంలో అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..