కారు ప్రమాదం కారణంగా IPLతో సహా.. కీలక టోర్నీలన్నింటికి దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో పంత్ పై తమకు ఉన్న ప్రేమను చాటుకుంది ఢిల్లీ జట్టు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
IPL 2023 లో శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మెుదటి మ్యాచ్ లో పంజాబ్ తో తలపడుతోంది కేకేఆర్ జట్టు. ఇక సాయంత్రం రెండో మ్యాచ్ లో సమవుజ్జీల సమరం సాగనుంది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొనబోతున్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలవబోతోందో ఇప్పుడు అంచనా వేద్దాం.