ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతుంది. గతంలో హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ.. కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సినిమాలు చేస్తోంది వరు. ఈ క్రమంలో వరలక్ష్మికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా పలు బాషల్లో చిత్రాలు చేస్తూ.. బిజీగా ఉంది. ఇక టాలీవుడ్ లో స్టైలిష్ లేడీ విలన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఓ కార్యక్రమంలో కోలీవుడ్ పరువుతీసేలా వ్యాఖ్యలు చేసింది జయమ్మ.