కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గర్వంగా భావిస్తారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి ఈ వజ్రం దేశానికి తీసుకొస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కోహినూర్ కోసం ప్రయత్నాలు చేస్తుందంటూ బ్రిటన్ మీడియా కథనాలు వెలువరించింది.
భారతదేశ చరిత్రలోనే కాక.. ప్రపంచ చరిత్రలో కూడా కోహినూర్ వజ్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వజ్రం కోసం యుద్ధాలు.. భారీ ఎత్తున రక్తపాతం జరిగింది. చారిత్రక నేపథ్యమే కాక భారీ విలువ కలిగిన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాజవంశం దగ్గర ఉంది. రాణి ధరించే కిరీటంలో చిక్కుకుపోయింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కోహినూర్ వజ్రం ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. మనవాడే ప్రధాని […]