టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన ఆటతో సచిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అంతేకాక సచిన్ ను మైమరిపించేలా కోహ్లి బ్యాటింగ్ చేస్తూ భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. అలానే ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేశాడు. తాజాగా మరో అరుదైన ఘనత కింగ్ కోహ్లి సాధించాడు.
ఐపీఎల్ లో తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ అయిన మన్ దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును సైతం బ్రేక్ చేశాడు.