మోసం ఎప్పుడూ నమ్మకం మాటునే జరుగుతూ ఉంటుంది. జల్సాల కోసం, సులభంగా డబ్బు సంపాదించాలని కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు. కానీ అక్కడ ఈ మోసాలకు భిన్నంగా అవయవాల చోరీకి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటనతో నివ్వెర పోయిన మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. రక్తంలో చేరుతున్న మలినాలను గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషపదార్థాలను ఎప్పటికప్పుడు వడబోస్తూ ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా.