ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే ‘ప్రజావాణి’. అలాంటి ఓ ప్రోగ్రామ్లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదుకు అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..!
సాధారణంగా వాహనాలపై చలానాలు పెండింగ్లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ససేమిరా అంటారు.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా తప్పదని అంటారు. అందుకే చాలా మంది చలానాలు లేకుండా.. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే చెల్లించి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక చలానాలు కట్టని వారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతుంటారు. ఎక్కడ నుంచి ఫోటో కొడతారో తెలియదు.. చలాన్లు కట్టాలని మెసేజ్ లు వస్తుంటాయి. అయితే కొంత మంది రాజకీయ నేతలు, బడా […]